NTV Telugu Site icon

ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి పిటిషన్ విచారణ..

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకా హత్య కేసులో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో హత్య చేసినట్లు సీబీఐ ముందు దస్తగిరి వాగ్మూలం ఇచ్చాడు. అయితే ఈ కేసులో కేసులో దస్తగిరికి క్షమాభిక్ష ఇస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.

దీంతో సీబీఐకు ఆ అధికారం లేదంటూ గంగిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కావాలని సీబీఐ తరుపు న్యాయవాది కోరారు.