Site icon NTV Telugu

రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి…

శ్రీకాకుళం సున్నాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు పోలీసులు సిబ్బంది మరణించారు. మృతుల్లో ఒక ఏఎస్ఐ , ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ , డ్రైవర్ ఉన్నారు. మందసలో ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీపు ఫ్రంట్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది జీపు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులలో కృష్ణుడు( ఏఎస్ఐ) , ఆంటోని( హెచ్.సీ) , బాబూరావు( హెచ్.సీ), జనార్ధన్ ( డ్రైవర్ ) గా గుర్తించారు అధికారులు.

Exit mobile version