Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృథాగా పోతున్న వరద నీరు..

  • ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృథాగా సముద్రంలో కలిసిపోతున్న వరద నీరు..
  • ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరు..
  • సముద్రంలోకి 4.23 లక్షల క్యూసెక్కుల వరద నీటిని రిలీజ్ చేసిన అధికారులు
Dawaleshwaram

Dawaleshwaram

Dowleswaram Barrage: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసి పోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Read Also: AC in Car: ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?

×
×
Ad

గత నెల 26వ తారీఖున 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయగా.. ప్రతి రోజు లక్ష నుంచి 50 వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసి పోతుంది.