Guntur Fake Notes: నకిలీ నోట్ల కలకలం.. జనం ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో నకిలీ నోట్లు బయటపడుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లకు తేడా తెలియకపోవడంతో జనం మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకోసం నకిలీ కరెన్సీ చలామణి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి మార్కెట్లోకి చలామణిలోకి తెస్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రెండుసార్లు నకిలీ నోట్లు బయపడ్డాయి. ఈపూరు మండలం ఎర్రబాలెంలో పొలానికి వెళ్తున్న రైతుకు రోడ్డుపై కరెన్సీ దొరికింది.
అయితే నోట్లను పరిశీలించిన రైతుకు అనుమానం వచ్చింది. దీంతో నగదును పోలీసులకు అప్పగించారు. నోట్లను పరిశీలించిన పోలీసులు నకిలీవిగా తేల్చారు. 87నకిలీ వందరూపాయల నోట్లుగా గుర్తించారు. నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు వచ్చి పోలీసుల భయంతో రోడ్డుపై పడేసి వెళ్లినట్లు అనుమానం. తాజాగా వినుకొండలో పెట్రోల్ కోసం బంక్ కు యువకుడు వచ్చాడు. ఐదువందల నోటు ఇచ్చిన యువకుడికి బాయ్ 200రూపాయల నోటు తిరిగి ఇచ్చాడు. ఈ నోటును చూసిన యువకుడికి అనుమానం వచ్చింది. తీరా పరిశీలిస్తే రెండు వందల రూపాయల నోటు నకిలీదిగా తేలింది. దీంతో యువకుడు ఖంగు తిన్నాడు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మాచర్లలో ఓ షాపులో నకిలీ నోట్లతో కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో యజమాని గుర్తించాడు. వెంటనే నకిలీ నోట్లుగా చెప్పడంతో తనకు ఎవరో ఇచ్చారని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇక దాచేపల్లి, రాజుపాలెం, పేరేచెర్ల ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు బయటకొచ్చాయి. ప్రధానంగా వంద, రెండు వందలు, ఐదువందల రూపాయల నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ పై అవగాహన ఉంటే చాలు ప్రింటర్ సాయంతో నోట్లు ప్రింటింగ్ చేసి ఈజీగా మార్కెట్లో చలామణి చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో నకిలీనోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డ వారిలో గుంటూరు జిల్లాకు చెందినవారు కూడా ఉన్నారు. ఒరిజినల్ నోట్లు పదివేలు ఇస్తే నకిలీ నోట్లు ముప్పైవేలు ఇస్తామంటూ అమాయకులను టార్గెట్ చేసి ఈ ఊబిలోకి దించుతున్నారు. పెద్దమొత్తంలో నకిలీ నోట్లు చలామణి చేస్తే ఇబ్బందులు కలుగుతాయని చిన్న మొత్తాల్లోనే చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు బయటకొచ్చినా అవి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకపోవడంతో నకిలీల దందా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఫేక్ దందాకు అడ్డుకట్ట వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!