Fake Baba: ‘మేకుల’ బాబా.. నమ్మించి మోసం చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: ఈ దేశంలో సినిమా ఉన్నంత కాలం జనాలు పిచ్చోళ్లు అవుతూనే ఉంటారని ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. మూఢనమ్మకాలు ఉన్నంతకాలం దొంగ బాబాలు కూడా రాజ్యమేలుతూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తాజా ఉదంతాన్నే తీసుకోవచ్చు. మేకులు కొడితే దోషం పోతుందని ఓ బాబా చెప్పిన మాటలు నమ్మి.. ఓ మహిళ దారుణంగా మోసపోయింది. విజయవాడలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని 35 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. కొంతకాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా.. అది అమ్ముడుపోవడం లేదు. దీంతో ఆందోళనకు గురైన రజనీకి ఏం చేయాలో పాలుపోలేదు. తనకు సన్నిహితంగా ఒక మహిళతో ఈ సమస్యని పంచుకుంది. అప్పుడు ఆమె మౌలల అనే ఒక దొంగ బాబాని రజనీకి పరిచయం చేసింది. ఈ బాబా చెప్పింది చేస్తే, భారీ లాభాలకు స్థలం అమ్ముడుపోతుందని నమ్మించింది. ఆమె మాటలు నమ్మి దొంగ బాబాను రజినీ సంప్రదించింది. అతనికి తన స్థలం సమస్య వివరించింది. ఇదే అదునుగా.. భారీ సొమ్ము కాజేందుకు దొంగ బాబా మాస్టర్ ప్లాన్ వేశాడు.
Vijayawada Crime: ఏం కష్టం వచ్చిందో ఏమో.. పెళ్లైన మూడు నెలలకే..?
స్థలం అమ్ముడుపోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలని సూచించాడు. పూజకి రెండున్నర లక్షల ఖర్చవుతుందని చెప్పాడు. అతడు చెప్పినట్టే రజనీ ఆ బాబాకి రెండున్నర లక్షలు ముట్టజెప్పింది. నాలుగు దిక్కులా మేకులు కొట్టింది. ఆమెను నమ్మించేందుకు 100 గంజాల స్థలం అమ్ముడుపోయేలా దొంగ బాబా చేశాడు. అప్పటికీ ఆశ చావని దొంగ బాబా.. స్థలం అమ్మిపెట్టినందుకు కమీషన్ కింద రూ.4 లక్షలు ఇవ్వాలని కోరాడు. లేకపోతే శాపం తగులుతుందని భయపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన రజినీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ దొంగ బాబా బాగోతం బట్టబయలైంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!