Site icon NTV Telugu

Minister Nadendla Manohar: ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు.. వైద్య సిబ్బంది ఆగ్రహం..

Minister Nadendla

Minister Nadendla

Minister Nadendla Manohar: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు.. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై విరుచుకుపడ్డారు.. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు మంత్రి.. ఇక, మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.. తన ఆకస్మిక పర్యటనలో.. ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మార్పులకు కీలక సూచనలు చేశారు.

Read Also: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం

ఇక, ఏలూరు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు సౌకర్యాలు పెంచడంపైన ఎక్కువ దృష్టి పెట్టాం అన్నారు.. నర్సులు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నట్టుగా గుర్తించాం.. వీల్ చైర్స్ సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సతో పాటు, స్పెషాలిటీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

Exit mobile version