Elephant Crosses Road: మన్యం జిల్లాలో ఏనుగుల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
- తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయాన్నే రోడ్డు దాటుతున్న గజరాజులు
- ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు.. భయాందోళనలో స్థానికులు
- నెమ్మదిగా రోడ్డు దాటిన ఏనుగుల గుంపు.. ట్రాఫిక్ కు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. అయితే.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయాన్నే రోడ్డు దాటుతున్న గజరాజులు వాహనదారులకు ఉత్కంఠను కలిగించాయి.
ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రద్దీగా ఉన్న సమయంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటడంతో రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అప్రమత్తమైన అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రాకర్లు వాహనాలను నిలిపివేసి, ఏనుగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను నియంత్రించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
అయితే..ఇలాంటి సందర్భాల్లోనే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా అడవులకు సమీపంలోని రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?