Site icon NTV Telugu

NBW Against Anantha Lakshmi Durga: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ.. పరారీలో లక్ష్మీ దుర్గ..

Lakshmi Durga

Lakshmi Durga

NBW Against Anantha Lakshmi Durga: తూర్పు గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గపై జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి Uma Sunanda ఈ ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అనంత లక్ష్మీ దుర్గపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనంత లక్ష్మీ దుర్గ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Read Also: Mla’s Defection : ఆ ఎమ్మెల్యేలకు ఊరట.. కడియం, దానం భవితవ్యంపై ఉత్కంఠ.!

కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసులో ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్‌ రోజా పాత్ర ఉందని పోలీసులు పేర్కొంటూ అనుబంధ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసిన విషయం విదితమే.. దీంతో ఆమెను ఈ కేసులో ఏ–2గా చేర్చిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్యలో అనంత లక్ష్మీదుర్గ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు కీలక ఆధారాలను కూడా అనుబంధ చార్జిషీట్‌కు జత చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ డ్రైవర్‌ హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రారంభ దర్యాప్తులో అనంతబాబును మాత్రమే ప్రధాన నిందితుడిగా చేర్చినప్పటికీ, తర్వాతి దర్యాప్తులో ఆయన భార్య పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ సమయంలో ఆమె పేరు ఎఫ్‌ఐఆర్‌ లేదా చార్జిషీట్‌లో చేర్చలేదు. ఇప్పుడు అనంత లక్ష్మీదుర్గపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది..

Exit mobile version