Narayana Swamy: చంద్రబాబు వల్ల ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోగా.. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు. జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివాడని.. అందుకే ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తాడని కొనియాడారు.
Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
Also Read
వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజలు సీఎం జగన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధమవుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. పేదవాళ్లు విద్యావంతులు కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ విద్యను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని.. ఆయన వల్ల ఒక్కరికి కూడా ఒరిగిందేమీ లేదన్నారు. అసలు చంద్రబాబు వల్ల ఒక్కరికి లబ్ధి చేకూరిందని చెప్పే పరిస్థితి లేదని ఆరోపించారు. పవిత్రమైన తిరుమల లాంటి ప్రదేశంలో చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి కూడా తన మనస్సు అంగీకరించడం లేదని నారాయణస్వామి అన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!