Srinivasa Rao: వర్షం వల్ల నష్టం 20 శాతమైతే డ్రైనేజి వ్యవస్థ వల్ల జరిగిన నష్టం 80 శాతం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైచాంగ్ తుఫాను చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైచాంగ్ తుఫానుకు రెండు రాష్ట్రాలు జలమయమైయ్యాయి. దీనితో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని.. కాగా వర్షం వల్ల 20శాతం నష్టం జరిగితే.. 80 శాతం నష్టం డ్రైనేజి వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు. అలానే నీట మునిగిన పంటకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బియ్యం, ధాన్యం మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించాలని.. అలానే ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాలని.. ప్రతి బస్తాకు 200 బోనస్ ఇచ్చి రైతుల వద్ద నుండి కొనాలని అయన కోరారు.
Read also:Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
అయితే ఇప్పటికే 75% పంటను కొన్నామని మంత్రులు అబద్ధం చెపుతున్నారు అని ఆయన ఆరోపించారు. కాగా పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేంద్ర నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు 10వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే రైతులకు రుణమాఫీ చేయాలని .. మళ్ళీ పంట వేసుకొనేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని.. రాష్ట్రప్రభుత్వం వరికి ఎకరాకు 25వేలు, ఉద్యాన పంటలకు 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆర్బిట్ కమిటీ వేసి కౌలు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపాలని కోరారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?