పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’ అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారు?చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్టపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు రామకృష్ణ.
పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఒప్పందం వల్ల దిగువ శ్రేణి ఉద్యోగులు నెలకు రూ.4 వేలు చొప్పున నష్టపోయే ప్రమాదముంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరోదఫా చర్చలు జరపాలి. అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
