కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద పసరు మందు పెద్ద చర్చగా మారింది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.. ఆయన వేలాది మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే తేల్చేరు అధికారులు.. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో.. ఏపీలో కొన్ని చోట్ల పసరు వైద్యులు తెరపైకి వచ్చారు.. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓ వ్యక్తి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున క్యూ కట్టారు ప్రజలు.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మరో ఆయుర్వేద వైద్యుడు తెరపైకి వచ్చారు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సుమారు 3 లక్షల మందికి పసరు మందు అందించినట్టు చెబుతున్నారు పసరు వైద్యుడు వివేక్ యాదవ్.. పసరు మందు తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదని చెప్పారు.. ఇక, పసరు మందు తీసుకున్న వారు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని.. ప్రస్తుతం కోవిడ్ సీరియస్ కేసులు కూడా పసరు మందు తిన్నాక కుడుదపట్టారని వెల్లడించారు.. గత 30 ఏళ్ల నుండి వివిధ రోగాలకు ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు వివేక్. ఇప్పటికీ ఆనందయ్య మందుపై ఎటూ తేలలేదు.. మరి వివేక్ యాదవ్ విషయం ఏంటో చూడాలి.
పులివెందులలోనూ కరోనాకి పసరు మందు.. నో సైడ్ ఎఫెక్ట్స్..!
Pulivendula