NTV Telugu Site icon

తిరుమల శ్రీవారి దర్శనాల పై కరోనా ఎఫెక్ట్…

తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని లక్షా ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 5,081 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,104 మంది భక్తులు. అయితే ఈ కరోనా కారణంగా శ్రీవారి ఆదాయం కూడా తగ్గిపోయింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలు. అలాగే మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు పడిపోయింది లడ్డు ప్రసాదం విక్రయాలు. ప్రస్తుతం భక్తుల భోజనాలు పది వేలు కూడా మించడం లేదు.