Cm Jagan Tour: నర్సాపురంలో జగన్ పర్యటన.. భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకోనున్న సీఎం. 11.15 – 12.50 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భీమవరంలో బీజేపీ నేతల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను అరెస్టు చేశారు.
సీఎం పర్యటనలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు:
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
రూ,2వేల 437 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
* 332 కోట్ల అంచనా వ్యయంతో ఏపి ఆక్వా విశ్వవిద్యాలయం శంకుస్థాపన, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన.
* 188.40 కోట్లతో ఉప్పుటేరు నదిపై మొళ్ళపర్రు వద్ద రెగ్యులేటర్ శంకుస్థాపన
* 4 కోట్లతో బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన.
* 1.08 కోట్లతో ఖజానా,లెక్కల కార్యాలయం శంకుస్థాపన.
* 132.81 కోట్లతో 220/132/33 కె.వి. రుస్తుంబాద విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన.
* 1,400 కోట్లతో జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుల శంకుస్థాపన.
* 237 కోట్లతో అండర్ గ్రౌండు డ్రైనేజీ స్కీము శంకుస్థాపన
* 26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు అభివృద్ధి పనులు శంకుస్థాపన.
* 7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి పనులు శంకుస్థాపన.
* 24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం పనులు శంకుస్థాపన.
* 8.80 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు & ముస్కేపాలెం అవుట్ ఫాల్ స్లుయిస్ పనులకు శంకుస్థాపన.
* 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాంతీయ వైద్యశాల నూతన భవనం ప్రారంభోత్సవం.
* 61.81 కోట్ల నిధులతో పూర్తి చేసినపురపాలక సంఘం మంచి నీటి అభివృద్ధి పథకం ప్రారంభోత్సవం
* అగ్రికల్చర్ కంపెనీ భూములు రైతులకు యాజమాన్య హక్కులు కల్పించడం.
* నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములు
* ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ శంకుస్ధాపన
* నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం
* ప్రజారోగ్యసాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం ప్రారంభోత్సవం
Read Also: Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!