ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడ పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కడప జయరాజ్ గార్డెన్స్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు సీఎం.
తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం. తదనంతరం సాయంత్రం సీఎం విశాఖ పర్యటన వుంటుందని సీఎంవో వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడి నుంచి నేవల్ ఎయిర్స్టేషన్, ఐఎన్ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలుకుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అక్కడ కార్యక్రమం ముగిశాక రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జగన్. విశాఖలో రాష్ట్రపతి రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.