Site icon NTV Telugu

ప్రధాని మోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ముఖ్యమంత్రి జగన్ వేరు వేరుగా లేఖ రాశారు. తెలంగాణతో ఉన్న జల పంచాయతీ పై ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ రాశారు జగన్. అంతేకాదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కో కు రాసిన లేఖ, విద్యుత్ ఉత్పత్తి కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీ ని లేఖకు జత చేసారు సీఎం జగన్‌.

read also : మ‌రోసారి ఎంసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీళ్లను ఉపయోగిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేసిన సీఎం జగన్‌.. కేఆర్ఎమ్బీ అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగాన్ని నిలిపివేసే విధంగా తెలంగాణకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతోన్న నీటి పంచాయతీలో ప్రధాని జోక్యాన్ని కోరిన సీఎం జగన్… కేఆర్ఎంబీ పరిధిని ఫిక్స్ చేయాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.

Exit mobile version