CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
- సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్..
- ప్రోటోకాల్ రగడపై మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుట్రలు, కుతంత్రాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిన సమయంలో, పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేతల మధ్య సమన్వయం దెబ్బతింటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
Also Read
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో జరిగిన గొడవలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో.. ఆయన స్పందించారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన చంద్రబాబు, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
కూటమి ప్రభుత్వంలో నేతలంతా ఒకే తాటిపై ఉండాలని, చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాల కోసం వీధి గొడవలకు దిగడం పార్టీ గౌరవాన్ని తగ్గిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. సీనియర్ నేతగా ఉన్న వర్మ ఇలాంటి వివాదాలకు కారణం కావడం సరికాదని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప, ఘర్షణలకు దిగడం తగదని చంద్రబాబు క్లాస్ పీకారు. అగ్ర నాయకులు ఇలా ప్రవర్తిస్తే క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు తప్పుడు సందేశం వెళ్తుందని, ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడికి ఆదేశాలు..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్కు సీఎం సూచించారు. వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప, మీడియాలో గానీ, బహిరంగంగా గానీ పార్టీ పరువు తీయవద్దని స్పష్టం చేశారు. పిఠాపురం లాంటి కీలక నియోజకవర్గంలో నేతలు సంయమనం పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?