Chinta Mohan: లోక్ సభ స్పీకర్ అంటే ఒక జడ్జి లా ఉండాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లే వారు స్పీకర్.. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావడం విచారకరం అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం.. నిన్న బెయిల్ కోసం వెళ్ళిన రాజ్ కేసిరెడ్డి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర దుస్థితిని సూచిస్తుందని పేర్కొన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.. చంద్రబాబు తల్లిని ఉద్దేశించి తిట్టడం జగన్ ఖండించకపోయిన, నేను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ లు రాక ఇబ్బందులు పడుతున్నారు అని చింత మోహన్ వెల్లడించారు.
Read Also: Rowdy-Janardhana : ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ?
అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అందించిన సౌకర్యాలను ఈ ప్రభుత్వం నిలిపేసిందని మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంభిస్తుంది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లు తిరిగి ప్రారంభించాలని డిమాడ్ చేశారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులకు సంబంధించి రావాల్సిన అన్నీ ముఖ్యమంత్రితో నేను సంతకం చేయిస్తాను అని తెలియజేశారు.
