Chandrababu Angry:మేం సమస్యల్ని ప్రస్తావిస్తే.. మీరు బూతులు తిడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. టీడీపీ సమస్యలని ప్రస్తావిస్తే.. వైసీపీ బూతులు తిడుతుంది. బూతులు తిట్టడం నాకు రాదు. ప్రత్యర్ధులు బూతులు తిడితే టీడీపీ కూడా తిట్టాల్సిన అవసరం లేదు.సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేశారు.నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారు. వివేకా హత్య రక్తపు మరకలు టీడీపీకి అంటిస్తున్నారు.గొడ్డలిపోటుతో వివేకా చనిపోతే.. గుండెపోటు అని అబద్దాలు చెప్పారు. సీబీఐ ఎంక్వైరీ కావాలని ఇద్దరు చెల్లెళ్లను పక్కన పెట్టుకుని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరైన జగనన్న బాణం తెలంగాణలో తిరుగుతోంది. వైఎస్ వివేకాను చంపారని మరో చెల్లెలపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డే వివేకా హత్యను దాచిపెట్టే ప్రయత్నం చేశారని స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ శంకరయ్య సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని రావణాసుర కాష్టంగా మార్చారు. ముద్దాయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీపై కేసులు పెట్టారంటే.. ఎంతగా బరితెగించారో అర్ధం అవుతోంది. వైఎస్ వివేకా హత్య విషయంలో సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా..? చనిపోయిన వ్యక్తి వివేకా క్యారెక్టరును చిన్నబుచ్చే రకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
అబద్దాన్ని అతికినట్టుగా చెప్పి జగన్ రాజకీయ లబ్ది పొందారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. వెంకన్నను అపవిత్రం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తూ సేవా టిక్కెట్ల ధరలు పెంచేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.భక్తులను వెంకన్నకు దూరం చేయాలనుకుంటున్నారా..? వెంకన్న పవరును తగ్గించాలని చూస్తున్నారా..?అని ప్రశ్నించారు చంద్రబాబు.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. మూడేళ్లైనా అతీగతీ లేదు. ఉద్యోగుల జీతాలు తగ్గించేశారు. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మించాలి.. అప్పుడే నదుల అనుసంధానానికి వీలు ఉంటుంది. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మాణం చేయగలిగితేనే రాయలసీమకు నీటిని అందివ్వగలం. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తామంటున్నారు. పోలవరం ప్రాజెక్టును కాస్త.. బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందన్నారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!