Corporation Directors: మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కార్

  • ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం..
  • ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున మొత్తం 60 డైరెక్టర్ల నియామకం..
Ap

Ap

Corporation Directors: ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఇటీవలే ఛైర్మన్లను నియమిస్తూ జీవో రిలీజ్ చేసింది. తాజాగా ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున మొత్తం 60 డైరెక్టర్లను నియమిస్తూ ఈరోజు (బుధవారం) ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి ఛాన్స్ ఇచ్చింది ఏపీ సర్కార్.