NTV Telugu Site icon

కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదు..!

Kannababu

తాము చేయలేని పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తొందనే కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి క‌న్న‌బాబు.. గత రెండేళ్ల కాలంలో రూ. 83 వేల కోట్లు వ్యవసాయానికి.. రైతులకు ఖర్చు పెట్టామ‌న్న ఆయ‌న‌.. ఉచిత బీమా చెల్లింపులను టీడీపీ చిన్న విషయంగా చూస్తోంద‌ని ఫైర్ అయ్యారు.. రూ.3783 కోట్లు పంటల బీమా నిమిత్తం చెల్లించాం.. టీడీపీ హయాంలో కట్టాల్సిన బీమాను కూడా మేమే చెల్లించామ‌న్న క‌న్న‌బాబు.. టీడీపీ హయాంలో రూ. 2900 కోట్లు మాత్రమే బీమా చెల్లింపుల నిమిత్తం ఖర్చు పెట్టార‌ని.. వాస్తవాలుంటే ఇలా ఉంటే.. రైతులను మేమే ఉద్దరించామని టీడీపీ చెప్పుకుంటోంద‌ని ఫైర్ అయ్యారు.. రైతులతో రాజకీయం చేస్తున్నందుకు టీడీపీ సిగ్గు ప‌డాల‌ని కామెంట్ చేసిన ఆయ‌న‌.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నామ‌ని .. పీఎం ఫసల్ బీమా యోజన నిధులను వినియోగించ లేద‌ని వెల్ల‌డించారు.. ఇక‌, రుణ మాఫీ బకాయిలు పెట్టిన టీడీపీ… వైసీపీని విమర్శిస్తుందా..? అంటూ ప్ర‌శ్నించారు మంత్రి క‌న్న‌బాబు..