అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించారు. చంద్రబాబు ఉన్నప్పుడు సంస్ధను ప్రారంభించారు… చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడింది అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారు. పిల్లల చదువు, పెళ్లి కోసం, ఎక్కువ మంది చిరు వ్యాపారులు అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకున్నారు. దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారు అని అన్నారు.
అయితే తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పాము. చెప్పినట్టే గత ఏడాది 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ సొమ్ము చెల్లించాము. రేపు 20 వేల లోపు ఉన్న వారందరికీ డిపాజిట్లు చెల్లిస్తున్నాము. అగ్రిగోల్డ్ లాంటి ఘటనలు జరిగితే ఏ ప్రభుత్వం తిరిగి బాధితులకు సొమ్ము చెల్లించిన దాఖలాలు లేవు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు దాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏటి అగ్రహారం లో కానిస్టేబుల్ తమ కుమార్తెతో మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము అని తెలిపారు.
కానీ లోకేష్ మాత్రం ఆ యువతి పై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఇట్లాంటి ప్రచారాల వల్ల బాధితులకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. బాధితురాలి భవిష్యత్తుకు ఇలాంటి తప్పుడు ప్రచారం మరింత ఇబ్బంది కలిగిస్తుంది అని పేర్కొన్నారు.