AP Medical College Tenders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, తొలి విడతలో భాగంగా నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, మెడికల్ కాలేజీలు, 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్లను పిలిచింది. టెండర్ ప్రకటనను ఏపీ ఎంఎస్ఐడీసీ వెల్లడించింది.