Site icon NTV Telugu

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.

Read Also: కోవిడ్ ఎఫెక్ట్: ఏపీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరణ

అటు ప్రభుత్వ పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ర్యాలీగా కలెక్టరేట్ల వద్దకు బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్ల ముట్టడిపై పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు.

Exit mobile version