Zonal System In AP: జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం..

  • ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
  • జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్..
  • త్వరలోనే మూడు జోన్లు ఏర్పాటు..
Ap Govt

Ap Govt

Zonal System In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ పట్నం, అమరావతి, రాయలసీమ జోన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్‌లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్‌లో 9 జిల్లాలు ఉండనున్నాయి. ఇక, నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు

Read Also: Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి

×
×
Ad

అయితే, ఒక్కో జోన్‌కు సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక, విశాఖపట్నం జోన్‌కు సీఈవోగా యువరాజ్ ని నియమించగా.. అమరావతి జోన్‌కు సీఈవోగా మీనా.. రాయలసీమ జోన్ కు సీఈవోగా కృష్ణబాబున నియమించనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.