ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,801 శాంపిల్స్ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు.
ఇదే సమయంలో 94 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 31128369 కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2076306 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,60,539 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1279 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,488 కు పెరిగింది.
