ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్తో ఒకే రోజు 13.72 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన వ్యాక్సినేషన్ డ్రైవ్పై సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్పై ట్విట్టర్లో స్పందించిన ఏపీ సీఎం.. కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు… గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ డాక్టర్లు, మండల అధికారులు, జేసీలు, కలెక్టర్ల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్న ఆయన.. సరిపడినన్ని వ్యాక్సిన్ డోసులు ఇస్తే… ఏమి చేయగలమో నిరూపించామన్నారు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన కోవిడ్ వారియర్లకి తన ట్వీట్లో అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్.
In our ongoing fight against COVID-19, AP has set an example by administering 13,72,481 vaccine doses in a single day. Credit goes to the team effort by the Village/Ward Secretariats, Volunteers, ANMs, ASHA workers, PHC doctors, Mandal Officers, Joint Collectors & Collectors.1/2— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2021