NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమై నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దును కేబినెట్ ఆమోదించడంతో పాటు వరద ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ విషయంపై కూడా మంత్రి వర్గంలో చర్చించి ఆమోదించనుంది. దీంతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన జరిగేలా కొత్త పారిశ్రామిక విధాన ప్రణాళికపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు.

Read Also: IND vs NZ: నేడే భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!

ఇక, వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పాలసీపై ఏపీ మంత్రి వర్గ భేటీలో చర్చించనునున్నారు. మొత్తం పది శాఖల్లో కొత్త విధానాలను రెడీచేశారని.. సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించి పాలసీలు రూపొందించడంలో దిశానిర్దేశం చేశారని అధికారులు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తెచ్చేలా నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రస్తుతం తుపాను ఎఫెక్ట్ ఉన్న జిల్లాలకు ఇప్పటికే కోటి రూపాయల నిధులను సైతం కేటాయించారు. ఆ జిల్లాల్లో నేడో రేపు తుపాను తీరం దాటే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.