ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. గతంలో సంవత్సరం జనవరిలో శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హజరుకాకపోవడంతో ఈ తీర్మానంపై వ్యతిరేకంగా ఓట్లు రాలేదు.
దీంతో ఆ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం మరో తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఏపీలో సంచలనం సృష్టించిన మూడు రాజధానుల చట్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం నిన్న ఉపసంహరించుకుంది. అయితే మరోసారి కొన్ని మార్పులతో మూడు రాజధానుల చట్టాన్ని తీసువస్తామంటూ వైసీపీ తెలిపింది.