NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధించే నైజం మాది కాదు.. వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. వ్యాపారులను ఎవరు వేధించినా సహించేది లేదన్నారు.. వినియోగదారులకు సరసమైన ధరలకే వ్యాపారులు సరుకులు అందించాలి అన్నారు.. గత ప్రభుత్వం లాగా వ్యాపారులను వేధించే నైజం మాది కాదని వ్యాఖ్యానించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి..

Read Also: Rahul Gandhi: ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు నేర్చుకోరా..

మరోవైపు.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి హరిత లు కలిసి సందర్శించారు. దసరా ఉత్సవాలు ముగింపులో భాగంగా శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వార్లకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు పట్టు వస్త్రాలను తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి పూజలు, అర్చనలు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులను ఆలయ అర్చకులు, ఈవో రమణారెడ్డి ఘనంగా సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ, స్వామివారి విశిష్టత గురించి ఆలయ అర్చకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులకు వివరించారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.