Annadata Sukhibhava status : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు , పేమెంట్ స్టేటస్ (Payment Status) ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా లభించే పెట్టుబడి సహాయం తమ బ్యాంక్ ఖాతాల్లో జమ అయిందో లేదో రైతులు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 పెట్టుబడి సహాయాన్ని మూడు విడతల్లో అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ‘పీఎం కిసాన్’ (PM-Kisan) వాటా రూ. 2,000 , రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 5,000 కలిపి, విడతకు మొత్తం రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో జమ చేస్తున్నారు.
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం:
- స్టెప్ 1: మొదట అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పోర్టల్ను ఓపెన్ చేయాలి.
- అధికారిక వెబ్సైట్: https://annadathasukhibhava.ap.gov.in/
- స్టెప్ 2: హోమ్పేజీ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్పై కనిపించే ‘Know Your Status’ లేదా ‘Beneficiary Status’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ఇప్పుడు అక్కడ ఓపెన్ అయిన బాక్స్లో రైతు యొక్క ఆధార్ నెంబర్ (Aadhaar Number) లేదా అప్లికేషన్ ఐడీని నమోదు చేయాలి.
- స్టెప్ 4: వివరాలు నమోదు చేశాక, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
- స్టెప్ 5: ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే మీ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా, ఒకవేళ పెండింగ్లో ఉంటే దానికి గల కారణం ఏమిటి అనే పూర్తి స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది.
వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.!
- రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ సేవ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించింది.
- ఇందుకోసం మొదట 9552300009 నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకుని, వాట్సాప్లో “Hi” అని మెసేజ్ పంపాలి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘సేవలను ఎంచుకోండి’ పై క్లిక్ చేసి, డ్రాప్ డౌన్ మెనూ నుండి ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava) ను సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ‘Status Check’ ఆప్షన్ను ఎంచుకుని, రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్ స్థితిని మొబైల్లోనే సులభంగా చూడవచ్చు.
డబ్బులు పడకపోతే ఏం చేయాలి?
అర్హత ఉండి కూడా ఖాతాలో డబ్బులు జమ కాకపోవడానికి ప్రధాన కారణాలు: ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ మ్యాపింగ్ (e-KYC) పూర్తి అవ్వకపోవడం లేదా భూమి రికార్డులలో తప్పులు ఉండటం. ఇటువంటి సమస్యలు ఉన్న రైతులు వెంటనే తమ పరిధిలోని ‘రైతు సేవా కేంద్రం’ (Rythu Seva Kendra) లేదా స్థానిక గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
