NTV Telugu Site icon

ఏపీలో నేడే ఇంట‌ర్ ఫ‌లితాలు…

ఈరోజు ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి.  సాయంత్రం 4 గంట‌ల‌కు మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల‌న చేయ‌నున్నారు.  ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.  సాయంత్రం 4 గంట‌ల త‌రువాత ఫ‌లితాల‌ను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవ‌చ్చు.  క‌రోనా స‌మ‌యంలో చాలా రాష్ట్రాలు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని పరీక్ష‌లను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచ‌న‌ల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకొని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది.  అయితే, ఫ‌లితాల‌ను వెల్ల‌డి చేసే విష‌యంలో ఎలాంటి విధానాలు అమ‌లు చేయాలి అనే అంశంపై ప్ర‌భుత్వం ఛాయార‌త‌న్ కమిటీని ఏర్పాటు చేసిన చేసింది.  ఆ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు ఈరోజు ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి.  

Read: సూర్య 40వ చిత్రం టైటిల్ ఏమిటంటే….