తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో.. దాదాపు ఆర్టీసీ బస్సులన్నీ ఒకే కలర్ లో ఉంటాయి. ఆ రంగులను బస్సు పేర్లను ఇప్పటికి రెండు రాష్ర్టాల ఆర్టీసీ సంస్థ ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టలేదు. వైయస్ రాజశేఖర్రెడ్డి కాలంలో… గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే… ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఆ బస్సుల కలర్ను గానీ పేరును గానీ మార్చలేదు. ఏ ప్రభుత్వాలు.. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పల్లె వెలుగు బస్సుల రంగును మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
జిల్లాల్లోని అన్ని పల్లెవెలుగు బస్సులు రంగులు మార్చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులతో ఉండగా, ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగించనున్నారు. మిగతా మూడు రంగులతో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ డిజైన్ కొంచెం మార్పు చేస్తున్నారు అధికారులు. మొదటగా రాజమహేంద్రవరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రంగు మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
