ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా వందకు దిగువకు చేరింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 83,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 7,943 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 98 మంది మృతిచెందారు.. మరోవైపు.. 24 గంటల్లో 19,845 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,93,085కు చేరుగా.. ఇప్పటి వరకు 10,930 మంది మృతిచెందారు.. రికవరీ కేసులు 15,28,260కు పెరగగా.. ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
ఏపీ కరోనా అప్డేట్
AP COVID 19