Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు..

AP COVID 19

AP COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భారీగా పెరిగాయి.. ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,442 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,412 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,73,996కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,40,368కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 13,444 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version