ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఈ సారి రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రేపు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక, ఇవాళ మొదట శ్రీకాకుళం వెళ్లనున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హస్తినకు వెళ్తారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ చేరుకోనున్న ఆయన.. రాత్రి 6.55 గంటలకు నార్సింగి ఓమ్ కన్వెన్షన్లో జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. ఇక, రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్న ఆయన.. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Read Also: Vice Presidential Poll: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ధన్కర్ ఎన్నిక లాంఛనమే!
ఇక, రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం కానున్న ఆయన.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, తన ఢిల్లీ పర్యటనలో సీఎం ఇంకా ఎవరైనా కలుస్తారా? రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు.. సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం.
