NTV Telugu Site icon

సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు.. ఏపీలో పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం

ఆంధ్రప్రదేవ్‌లో పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది డివిజన్‌ బెంచ్.. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు.. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు సింగిల్ బెంచ్… అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్.. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్.. పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును రద్దు చేసింది.