School Violence: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చైతన్య శ్రీవిష్ణు కార్తీక్ కుమార్ ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థిపై జాన్, శాంతి అనే ఉపాధ్యాయులు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: Astrology: ఫిబ్రవరి 1, ఆదివారం దినఫలాలు..
అయితే, పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి కార్తీక్ కుమార్ తన తల్లికి పూర్తిగా చెప్పలేదు.. కేవలం “చేతులు నొప్పిగా ఉన్నాయని మాత్రమే తెలిపాడు. అయితే, తల్లి స్నానం చేయించేటప్పుడు బాలుడి చేతులు, మోచేతులపై తీవ్రమైన గాయాలు, నల్లగా మారిన వాతలు కనిపించడంతో ఆమె తీవ్రంగా విలపించింది. విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన తీరు చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
