NTV Telugu Site icon

పవన్ కు కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదు : అంబటి

పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం. మిత్రులను అడిగే ధైర్యం లేని వాళ్ళకు మాకు అడిగే హక్కు ఎక్కడిది. ప్రజాస్వామ్య పద్దతిలో కేంద్రంపై మేము పోరాటం చేస్తున్నాం. డిమాండ్ల సాధన కోసం మేము సాయుధ పోరాటం చేయాలా… తుపాకులు పట్టుకు తిరగాలా అన్నారు.

పవన్ కు దమ్ముంటే, చిత్తశుద్ది ఉంటే ప్లకార్డు పట్టుకుని బీజేపీ కార్యాలయం ముందు నిలబడాలి. కనీసం ప్లకార్డు పట్టుకోలేని నీవో రాజకీయ నాయకుడివా..నిన్ను ప్రజలు నమ్మలా… నీ ఓటుకేపాసిటీ ఎంత… ఏం తడాఖా చూపిస్తావు అని అన్నారు. అయితే పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఒడారు..ఈసారి మూడు చోట్ల పోటీ చేయి. పవన్ ఏమైనా చెగువీరా వారసుడా..తుపాకి గొట్టం ద్వారా రాజ్యం తీసుకువస్తారా… మాట్లాడే సమస్యలపై పూర్తి స్పష్టత తీసుకుని పవన్ మాట్లాడాలి. నాలుగు రోజులు రాజకీయాలు..ఏడాది పాటు సినిమాలు చేయడమే పవన్ పని. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు అని పేర్కొన్నారు.