YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు వైద్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితులపై వైద్యులు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు అవసరమైన వైద్య చికిత్స పొందలేకపోతున్నారని, చికిత్సల కోసం అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను పారదర్శకంగా జారీ చేయడం లేదని జగన్కు వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించామని జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలో కూడా రోగులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
Also Read
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!