YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు వైద్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితులపై వైద్యులు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు అవసరమైన వైద్య చికిత్స పొందలేకపోతున్నారని, చికిత్సల కోసం అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను పారదర్శకంగా జారీ చేయడం లేదని జగన్కు వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించామని జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలో కూడా రోగులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
Also Read
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
-
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!