Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ys Jagan Gives Directions To Mlas And Mlcs At Ysrcp Legislative Party Meeting

YS Jagan: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. నేతలకు జగన్‌ దిశానిర్దేశం..

Published Date :September 18, 2025 , 5:47 pm
By Sudhakar Ravula
  • వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ..
  • సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చ..
  • మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం..
  • అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు..
YS Jagan: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. నేతలకు జగన్‌ దిశానిర్దేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు..

మొన్న ప్రెస్‌మీట్‌లో సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ మోసాలు, మెడికల్‌ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను.. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం అవకాశం ఇస్తే.. నిశితంగా సభలో చెప్పగలుగుతాం.. లేదు, ఇవ్వం, రెండే రెండు నిమిషాలు ఇస్తామంటే.. ఇక మాట్లాడేది ఏముంటుంది..? అని ప్రశ్నించారు జగన్‌.. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే.. ఇంకేం మాట్లాడగలం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే.. అందులో మూడు పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైయస్సార్‌సీపీ మాత్రమే. మిర అలాంటి రాజకీయ పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది.. అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం వస్తుంది.. కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు.. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మేం మాట్లాడుతున్నాం అన్నారు జగన్‌.

అయితే, మండలిలో మనకు మంచి బలం ఉంది.. మండలిలో మనం ప్రజల తరఫును గొంతు విప్పడానికి అవకాశం ఉంది.. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం అన్నారు వైఎస్‌ జగన్.. ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్న ఆయన.. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడంలేదు అని విమర్శించారు.. లా అండ్‌ ఆర్డర్‌ కూడా దారుణంగా ఉంది.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు.. అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ప్రతిచోటా దోపిడీ చేస్తున్నారు. మండలి సభ్యులు పోరాట పటిమ చూపించాలని సూచించారు.. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలన్నారు.. అసెంబ్లీలో అధికారపక్షం డబుల్‌ యాక్షన్‌ చేయాలనుకుంటోంది.. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయంగానే చూస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎలాగూ వారు సమయం ఇవ్వరు కాబట్టి అసెంబ్లీ జరిగే సమయంలో ఆయా అంశాలపై మీడియా ద్వారా ప్రతి అంశంపైన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. నేను కూడా సమ్‌ అప్‌ చేస్తూ మీడియాతో మాట్లాడతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • YCP legislative party meeting.
  • YCP MLAs
  • YCP MLCs
  • ys jagan

తాజావార్తలు

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

  • Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

  • Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!

  • Donald Trump: యుద్ధం తెచ్చిన ఊహించని ముప్పు.. ట్రంప్ సామ్రాజ్యం కూలిపోనుందా?

  • Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions