Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ న ఏత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసానికి తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు అనుమతించడంతో, మధ్యాహ్నం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా, వారు స్పందించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
నివాసంపై గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు అడ్డుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారాలతో సహా హైకోర్టుకు సమర్పించినట్లు జోగి రోహిత్ తెలిపారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ, న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
