NTV Telugu Site icon

AP IAS Officers Transfer: ఏపీలో మరో సారి ఐఏఎస్‌ల బదిలీలు..

Ias

Ias

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్..

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారులు:
* ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.
* స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా.
* కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌గా నవ్య
* గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా ఎస్. భార్గవి.
* ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్.
* ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పోరేషన్ ఎండీగా దినేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు.
* ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.
* అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా డి.హరిత
* తూర్పు గోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్. చిన్న రాముడు.
* గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.శ్రీనివాసులు.
* పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా టి.రాహుల్ కుమార్ రెడ్డి.
* విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా సేదు మాధవన్.
* నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా కె.కార్తీక్.