Andhra Pradesh: ఏపీకి గుడ్న్యూస్.. రూ.567 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- ఏపీకి రూ. 567 కోట్ల గ్రాంటు విడుదల చేసిన కేంద్రం..
- 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఆరోగ్య రంగానికి ఆఖరి విడత నిధులు..
- గత 19 నెలల్లోనే 48 శాతం నిధులను వెచ్చించిన వైద్యారోగ్య శాఖ..
- వెల్లడించిన మంత్రి సత్యకుమార్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది.. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత 19 నెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం మేర వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల వినియోగం గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషికి కేంద్రం గుర్తింపు ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
Read Also: 10,000mAh బ్యాటరీ క్లబ్ లోకి Realme P సిరీస్.. భారత్లో లాంచ్ అప్పుడే..!
Also Read
పూర్తి స్థాయిలో 15వ ఆర్థిక సంఘం నిధులను పొందిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో 2025–26 బడ్జెట్ వ్యయంపై మంత్రి సమీక్షించారు. మిగిలిన నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ఆసుపత్రుల బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!