Pawan Kalyan: శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదు
- శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదు
- మేడే వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదు ఉపాధి శ్రామికులు అని పిలుస్తాం. శ్రామికుల మాటలు వింటుంటూ ఎంతో ఆనందం కలిగింది. మేము కూడా నా చిన్నప్పుడు 3 ఎకరాలు అమ్ముకున్నాం. పాతికేళ్ల క్రితం 8 ఎకరాలు కొనుక్కున్నా. కండ కరిగించే వాళ్లు లేకపోతే గ్రీన్ రివల్యూషన్స్ రావు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా అవసరం. శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదు. ఓట్ల కోసం నేను ఏ పనీ చేయడం లేదు. మూగ జీవాలకు చేస్తే ఓటెయ్యవు. మాకు ఓటు గురించి ఆలోచన లేదు. ఏపీ పంచాయితీరాజ్ శాఖ కూడా దాహార్తి నుంచి మూగజీవాలను రక్షించడానికి పూనుకుంది.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: అమరావతిలో మోడీ సభకు వాన గండం..! అధికారులు ప్రత్యేక దృష్టి
Also Read
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
‘‘పంచాయితీరాజ్ నిధులు ఇప్పుడు మన రాష్ట్రానికి ఆక్సిజన్ అయ్యాయి. గత ఆర్ధిక సవత్సరంలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశాం. వేతనాలకు రూ.6,190 కోట్లు.. మిగిలినది మెటీరియల్ కింద ఖర్చు చేశాం. పల్లె పండుగలో భాగంగా రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశాం. 13,500 పశువుల తొట్టెలు రూ.60.75 కోట్లతో పూర్తి చేయడానికి కారణం శ్రామికులే. రూ.1800 కోట్లతో 36 వేల ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీలలో రోడ్లు వేశాం. డోలీ తప్ప ఇంకేం లేని చోటికి కూడా అంబులెన్స్ వెళుతోంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా ప్రాధాన్యం. ఉపాధి శ్రామికుడు పని ప్రదేశంలో మరణిస్తే చెల్లించే రూ. 50 వేలు ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచాం. ఉపాధి శ్రామికులు ఎండాకాలం ఉదయం 11 లోపు పూర్తి చేయాలి. అవసరం అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మళ్లీ చేయాలి. ఉపాధి శ్రామికులకు గ్రామాల్లో ఏఎన్ఎంల సేవలు, వైద్య సదుపాయం ఉంటుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఉపాధి శ్రామికులకు రూ.3 లక్షల నుంచీ రూ.30 లక్షల ఉచిత ప్రమాద భీమా ఇవ్వడానికి ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని మా ప్రభుత్వానికి ఉపాధి శ్రామికుల సంక్షేమం ధ్యేయం. పని చేసే వాళ్లు ముందుంటే దేశం వెనుకబడదు. పని చేసేవాళ్లకు అత్యధిక గౌరవం ఇవ్వాలి.’’ అని పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు ఆదేశం
తాజావార్తలు
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!