Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Naidu Reviews Amaravati Capital Works Expresses Displeasure Over Delays

CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

Published Date :April 4, 2026 , 4:00 pm
By Sudhakar Ravula
  • లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి..
  • వేగం మరింత పెరగాలి... ఐకానిక్ ముద్ర కనిపించాలి..
  • నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు... రాజధాని..
  • రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్..
  • ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి..
  • అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..
  • రాజధానిలో అగ్నిప్రమాదాలపై సీఎం అసంతృప్తి...
CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని.. ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టుగా భావించవద్దని.. చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టుగా భావించాలన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలువైన పనులు ఉండగా… వాటిలో రూ. 50, 943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.

హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20 వేల మంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది.. లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు అవసరమైన మ్యాన్ పవర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కాంట్రాక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలా మంది కార్మికులు వెళ్లారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్ పవర్ ఎంత వరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని పనుల్లో ఎంత మెషినరీని వినియోగిస్తున్నారనే అంశం పైనా సీఎం ఆరా తీశారు. రాజధాని పనుల్లో 5,580 మెషినరీ అవసరముండగా… ప్రస్తుతం 3767 మెషనరీ ఉందని అధికారులు వివరించారు. ఇవి కాకుండా హాట్ మిక్స్ 16, వెట్ మిక్స్ మెషిన్లు 36, ఆర్ఎంసీ మిషన్లు 34 ఉన్నాయని తెలిపారు.

అయితే, వారం, నెల వారీగా టార్గెట్‌లు పెట్టుకుని రాజధాని పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను… నిర్దేశించుకున్న టార్గెట్లను విశ్లేషిస్తే… వారానికి రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే వర్షా కాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి.. ఆలోగానే చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దు… ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టే.. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి… కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే.. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. మ్యాన్ పవర్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది… ప్రతీ నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యమెందుకు…?
సమీక్ష సందర్భంగా ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటన ప్రస్తావనకు వచ్చింది. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థలకు లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టు సంస్థలు కానీ… అధికారులు కానీ తగిన రీతిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని… ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలర్ట్ చేయాలని ఆదేశించారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా… ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు.. బురద జల్లేందుకు, కుట్రలు పన్నేందుకు కొందరు సిద్దంగా ఉన్నారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయా నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్టు మేనేజర్లుగా సమర్థులను నియమించుకోవాలని సూచించారు. సరైన వాళ్లని నియమించుకోకుంటే… ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అనుమతించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు
రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఫారెస్ట్ అధికారుల కారణంగా గ్రావెల్ సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని.. జిల్లా కలెక్టర్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నా… ఫారెస్ట్ అధికారులతోనే అసలు సమస్య వస్తోందనే విషయం సమావేశంలో సీఎం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ వంటివి గ్రీన్ ఛానెల్ ద్వారా వెళ్లాలని.. ఎవరి ఒత్తిళ్లకూ గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati capital works update
  • Amaravati infrastructure projects
  • Amaravati progress report
  • Andhra Pradesh capital development
  • AP capital construction news

తాజావార్తలు

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

  • Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions