Site icon NTV Telugu

CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Chandrababu Ugadi Speech

Chandrababu Ugadi Speech

CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

* ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.

* ఉదయం 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి యాడికి గ్రామ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే “ప్రజా వేదిక” సమావేశానికి చేరుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.

* మధ్యాహ్నం 01:00 నుంచి 01:30 వరకు సమయం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత 01:30 గంటలకు ప్రజా వేదిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం అక్కడి నుంచి బయలుదేరి 01:40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుంటారు.

* వేములపాడు వద్ద ఉన్న పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని మధ్యాహ్నం 01:40 నుంచి 02:30 వరకు సందర్శిస్తారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు, ముఖ్యంగా PMDS మరియు హాఫ్ మూన్ మోడల్ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం 02:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 02:40 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

* మధ్యాహ్నం 02:40 నుంచి సాయంత్రం 04:10 వరకు వేములపాడులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో (Cadre Meeting) సీఎం పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.

* చివరగా సాయంత్రం 04:20 గంటలకు వేములపాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 06:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను సమీక్షించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

Exit mobile version