Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంధన కొరత సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ రోజు సాయంత్రానికి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రం నాటికి రిటైల్ పెట్రోల్ బంకులకు చేరుకుంటాయని సమాచారం ఇచ్చారు.
Read Also: Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఇక, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షణ చేపట్టి ఇంధన సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, అలాగే క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజల్లో అనవసర ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ట్యాంకర్లు చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. సరఫరాలో ఆలస్యం జరిగితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక, బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు, అధికారులు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
తాజావార్తలు
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!