CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
- మూడో రోజు దావోస్లో సీఎం చంద్రబాబు టూర్..
- ఇవాళ కీలక సమావేశాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Davos Visit: స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.
Read Also: Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్పై ట్రంప్ వ్యాఖ్య
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీలు
ఈ పర్యటనలో భాగంగా హొరైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్లతోనూ సీఎం చర్చలు జరపనున్నారు. ఇక, పలు అంతర్జాతీయ సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.. ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే “హీలింగ్ ప్లానెట్ త్రూ రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్” పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అలాగే “ట్రిలియన్ డాలర్ పైవోట్ – రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్” అంశంపై జరిగే మరో కీలక చర్చలోనూ పాల్గొననున్నారు.
బ్లూమ్బర్గ్ సెషన్లో ముఖ్య వక్తగా ప్రసంగం
బ్లూమ్బర్గ్ సంస్థ నిర్వహించే “ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ – ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ” అనే సెషన్లో సీఎం చంద్రబాబు ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆర్థిక మార్పులపై తన దృక్పథాన్ని వెల్లడించనున్నారు. ఇక, ఏపీ లాంజ్లో నిర్వహించే “బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్” కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వాతావరణ మార్పులు, పునరుత్పాదక అభివృద్ధిపై “ఫైనాన్సింగ్ రీజెనరేషన్ – మొబిలైజింగ్ క్యాపిటల్” అనే అంశంపై జరిగే మరో కార్యక్రమంలోనూ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మొత్తంగా దావోస్ పర్యటన మూడో రోజున కూడా సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్తో వరుస సమావేశాల్లో పాల్గొంటూ, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!