AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానానికి ముందుగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించే ప్రక్రియ కొనసాగనుంది.
Read Also: Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ఇక ఈ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత రాష్ట్రంలో వివిధ రంగాలపై యుద్ధ ప్రభావం గురించి శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హోటల్ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (LPG) నుండి పీఎన్జీ (PNG)కి మార్పు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!